News6th May 03:09 PMSunil Byrisetty1 min read

"పోలవరం" పైనే రాష్ట్ర అభివృద్ధి

రాష్ట్ర అభివృద్ధికి, పోలవరం ప్రాజెక్ట్ పూర్తికి అవినాభావ సంబంధం ఉందని జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు విదేశీ నిపుణుల బృందానికి చెప్పారు. అలాగే జాతీయస్థాయిలో నదుల అనుసంధాన

"పోలవరం" పైనే రాష్ట్ర అభివృద్ధి
రాష్ట్ర అభివృద్ధికి, పోలవరం ప్రాజెక్ట్ పూర్తికి అవినాభావ సంబంధం ఉందని జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు విదేశీ నిపుణుల బృందానికి చెప్పారు. అలాగే జాతీయస్థాయిలో నదుల అనుసంధానానికి పోలవరం ప్రాజెక్టు పూర్తికి విడదీయలేని పరస్పర ఆధార ప్రాజెక్టులుగా మంత్రి అభివర్ణించారు. అందువల్లనే ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పోలవరం పై ప్రత్యేక దృష్టి నిలిపారని మంత్రి వివరించారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తికి సాంకేతిక సలహాలు ఇవ్వడానికి వచ్చిన విదేశీ నిపుణుల బృందాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు కలిశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సిన ఆవశ్యకతను, అవసరాన్ని నిపుణుల బృందానికి తెలియజెప్పారు. ముందు నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం 2027 కల్లా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయాల్సి ఉంది. అందువల్ల మీరంతా సహకరించి లక్ష్యాన్ని కంటే ముందుగా పూర్తయ్యేటట్లు ప్రయత్నించాలని కోరారు. ఎగువ కాఫర్ డ్యామ్ బలోపేతం చేసేలా నిర్మిస్తున్న బట్రస్ డ్యామ్, గ్యాప్-2 డి వాల్ పనులను మంత్రి నిమ్మల పరిశీలించారు. ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ టీంతో మాట్లాడి సాంకేతిక వివరాలు తెలుసుకున్నారు.
Andhra Pradesh
Polavaram Project
Minister Nimmala Ramanaidu
పోలవరం ప్రాజెక్ట్
ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్
ఎగువ కాఫర్ డ్యామ్వి
దేశీ నిపుణుల బృందాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు కలిశారు
Scroll for the next article