News6th Jul 03:08 PMSunil Byrisetty1 min read
తోటపల్లి నీటిని విడుదల చేసిన మంత్రి సంధ్యారాణి
స్త్రీ, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తోటపల్లి జలాశయం నుండి ఖరీఫ్ కు నీటిని విడుదల చేశారు. పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని దాదాప
స్త్రీ, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తోటపల్లి జలాశయం నుండి ఖరీఫ్ కు నీటిని విడుదల చేశారు. పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని దాదాపు 17 మండలాల్లోని చిన్న నీటిపారుదల ట్యాంకులను నింపడానికి నీటిని విడుదల చేశారు. ఇది ప్రాజెక్ట్ కింద చివర ఆయకట్టు వరకు నీటి నిర్వహణకు సహాయపడుతుందని తెలిపారు. ఈ రిజర్వాయర్ను 1,31,221 ఎకరాల ఆయకట్టును అందించడానికి యోచించగా, ఇప్పటి వరకు 84,033 ఎకరాల ఆయకట్టుకు అందించగలిగామని వివరించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 13,684 ఎకరాలకు గాను 5,238 ఎకరాలకు, విజయనగరం జిల్లాలో 78,563 ఎకరాలకు గాను 55,443 ఎకరాలకు, శ్రీకాకుళం జిల్లాలో 38,974 ఎకరాలకు గాను 23,351 ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. 2024 ఖరీఫ్ సమయంలో, విజయనగరం జిల్లాలో మొత్తం 40,440 ఎకరాలకు కాలువల కింద, 13,133 ఎకరాల ఆయకట్కు చెరువుల ద్వారా, పార్వతీపురం మన్యం జిల్లాలో 3754 ఎకరాలు కాలువలు, 2269 ఎకరాల అయకట్ చెరువులు క్రింద, శ్రీకాకుళం జిల్లాలో 14,415 ఎకరాలు కాలువలు, 5372 ఎకరాల ఆయాకట్కు కాలువల ద్వారా సాగునీరు అందించడం జరుగుతోందన్నారు. పాత ప్రధాన ఎడమ కాలువ (LMC), ప్రధాన కుడి కాలువ (RMC), ఓపెన్ హెడ్ ఛానల్స్ కింద 64 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగిందని పేర్కొన్నారు. 2025 ఖరీఫ్లో, కొత్త కుడి ప్రధాన కాలువ కింద సుమారు 84,033 ఎకరాల ఆయకట్టును, పాత తోటపల్లి రెగ్యులేటర్ ఆయకట్టు కింద 64 వేల ఎకరాల స్థిరీకరణకు చర్యలు చేపట్టారు.