News31st Oct 05:00 PMSunil Byrisetty1 min read
నెట్వర్క్ ఆస్పత్రులతో ఏపీ ప్రభుత్వ చర్చలు సఫలం
నెట్వర్క్ ఆస్పత్రులతో ఏపీ ప్రభుత్వ చర్చలు సఫలమయ్యాయి. నెట్వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు సమ్మె విరమించాయి. దీంతో ఏపీ వ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. పది రోజుల్ల
నెట్వర్క్ ఆస్పత్రులతో ఏపీ ప్రభుత్వ చర్చలు సఫలమయ్యాయి. నెట్వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు సమ్మె విరమించాయి. దీంతో ఏపీ వ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. పది రోజుల్లో రూ.670 కోట్లు విడుదలకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మరో 15 రోజుల్లో మిగిలిన బకాయిలు చెల్లిస్తామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. దీంతో నెట్వర్క్ ఆసుపత్రులు సమ్మె విరమణకు అంగీకరించాయి.