Politics13th Apr 11:26 AMSunil Byrisetty1 min read

మంత్రుల పేషీల్లో ఏం జరుగుతోంది?

ఏపీలో మంత్రుల పేషీల్లో ఏం జరుగుతోందో ముఖ్యమంత్రి కార్యాలయం ఆరా తీస్తోంది. మంత్రుల కార్యాలయాల్లో పని చేస్తు్న్న వారిపై పలు ఆరోపణలు వస్తుండటంతో నిఘా పెట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే

మంత్రుల పేషీల్లో ఏం జరుగుతోంది?
ఏపీలో మంత్రుల పేషీల్లో ఏం జరుగుతోందో ముఖ్యమంత్రి కార్యాలయం ఆరా తీస్తోంది. మంత్రుల కార్యాలయాల్లో పని చేస్తు్న్న వారిపై పలు ఆరోపణలు వస్తుండటంతో నిఘా పెట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే పలువురు ఓఎస్డీ, పీఎస్, పీఏలపై అవినీతి ఆరోపణలు వినిపిస్తు్న్నాయి. సీఎంవోకు ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్టులో వెల్లడైన వాస్తవాలు నివ్వెరపరిచేలా ఉన్నాయని సమాచారం. ఇప్పటికే మంత్రి కొల్లు రవీంద్ర ఓఎస్డీపై వేటు పడింది. గతంలో తన ప్రైవేట్ అసిస్టెంట్‌పై ఆరోపణలు రావడంతో హోంమంత్రి అనిత అతడిని తొలగించిన విషయం తెలిసిందే. అలాగే మరికొందరు ఓఎస్డీలపైనా తీవ్రమైన అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో సీఎం చంద్రబాబు రంగంలోకి దిగి మంత్రులను హెచ్చరించారు
Andhra Pradesh
ministers
Mining Row
హోంమంత్రి అనిత
ప్రైవేట్ అసిస్టెంట్‌
సీఎం చంద్రబాబు మంత్రులను హెచ్చరించారు
Scroll for the next article