Crime7th Apr 01:11 PMSunil Byrisetty1 min read

లిక్కర్ కుంభకోణంలో సుప్రీంకు మిథున్ రెడ్డి

ఏపీని కుదిపేస్తున్న లిక్కర్ కుంభకోణంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చ

లిక్కర్ కుంభకోణంలో సుప్రీంకు మిథున్ రెడ్డి
ఏపీని కుదిపేస్తున్న లిక్కర్ కుంభకోణంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ జేవీ పార్థీవాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించనుంది. వైసీపీ హయాంలో పెద్ద ఎత్తున లిక్కర్ కుంభకోణం చోటుచేసుకుందని ఏపీ సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మిథున్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. అయితే ఎఫ్ఐఆర్‌లో తన పేరు లేకపోయినా ఏపీ హైకోర్టులో మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చడంతోపాటు ఎఫ్ఐఆర్‌లో పేరు లేనప్పుడు బెయిల్ ఎలా ఇస్తామని ప్రశ్నించింది. బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ నేపథ్యంలో, ఆయన ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు
YSRCP
Midhun Reddy
Supreme Court
AP liquor Scam
వైసీపీ
బెయిల్ పిటిషన్‌
లిక్కర్ కుంభకోణం
Scroll for the next article