News2nd Aug 12:16 PMSunil Byrisetty1 min read
పిఠాపురంలో ఎమ్మెల్సీ నాగబాబు పర్యటన
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కె. నాగబాబు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన "వన్ స్టేషన్-వన్ ప్రోడక్ట్" పథకంలో భాగ
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కె. నాగబాబు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన "వన్ స్టేషన్-వన్ ప్రోడక్ట్" పథకంలో భాగంగా సెర్ప్ విభాగం వారిచే పిఠాపురంలో ఏటికొప్పాక బొమ్మలతో ఏర్పాటు చేసిన హ్యాండీక్రాఫ్ట్ స్టాల్ నాగబాబు ప్రారంభించారు. వీర మహిళ పిల్లా రమ్య జ్యోతి ఆధ్వర్యంలో ఈ స్టాల్ ఏర్పాటైంది. పిఠాపురం పట్టణం ఇందిరానగర్ లో జనసేన వీరమహిళ పిట్ట ముని ఇల్లు ఇటీవల అగ్ని ప్రమాదంలో దగ్ధమైన నేపథ్యంలో స్థానిక జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాస్ సహకారంతో పునర్నిర్మించిన ఆ ఇంటిని నాగబాబు చేతుల మీదుగా అందజేశారు. అనంతరం వ్యవసాయ ఆధారిత పనుల కోసం ఉపయోగించే ఫెర్టిలైజర్ డ్రోన్ పని చేసే విధానాన్ని పిఠాపురంలో శిక్షణ పొందిన యువకులను నాగబాబు అడిగి తెలుసుకున్నారు.