News27th Oct 05:13 PMSunil Byrisetty1 min read
మోంథా తుఫాన్ ఎఫెక్ట్.. 43 రైళ్లు రద్దు
మోంథా తుఫాను కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పాఠశాలలకు 3 రోజులు సెలవు ప్రకటించారు. అలాగే తుఫాన్ ప్రభావంతో ఈస్ట్ కోస్ట్ రైల్వే అప్రమత్తమైంది. ఏపీ పరిధిలో నేడు, రేపు మొత్తం 43 రై
మోంథా తుఫాను కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పాఠశాలలకు 3 రోజులు సెలవు ప్రకటించారు. అలాగే తుఫాన్ ప్రభావంతో ఈస్ట్ కోస్ట్ రైల్వే అప్రమత్తమైంది. ఏపీ పరిధిలో నేడు, రేపు మొత్తం 43 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా విశాఖపట్నం మీదుగా వెళ్లే రైళ్లను రద్దు చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. తుఫాను తీవ్రత ఆధారంగా మరిన్ని మార్పులు చేయవచ్చని, ప్రయాణికులు గమనించాలని సూచించింది. తుఫాన్ తీవ్రంగా మారుతుండటంతో ప్రభుత్వం అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుంటోంది.