News10th May 04:02 PMSunil Byrisetty1 min read
ఇస్లాం పేరుతో పాక్ అబద్ధపు ప్రచారం
ఇస్లాం పేరుతో పాక్ అబద్ధపు ప్రచారం చేస్తోందని ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. అమాయకులను, చిన్నపిల్లలను చంపమని ఇస్లాం చెప్పలేదన్నారు. పవిత్రమాసంలో చిన్నపిల్లలను,
ఇస్లాం పేరుతో పాక్ అబద్ధపు ప్రచారం చేస్తోందని ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. అమాయకులను, చిన్నపిల్లలను చంపమని ఇస్లాం చెప్పలేదన్నారు. పవిత్రమాసంలో చిన్నపిల్లలను, అమాయకులను చంపే పాక్కు ఇస్లాం పేరు పలికే అర్హత లేదని స్పష్టం చేశారు. భారత్ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. పాక్ దాడులకు మించి భారత్ దాడి చేస్తుందని పేర్కొన్నారు. దేవుడి దయతో మనం భారతభూమిపై జన్మించామని, ఈ భూమి కోసం ప్రాణాలు అర్పిస్తామని అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు.