Telangana24th Jun 05:26 PMSunil Byrisetty1 min read
ఫోన్ ట్యాపింగ్పై ఎంపీ ఈటల సంచలన వ్యాఖ్యలు
ఫోన్ ట్యాపింగ్పై ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే తన ఫోన్ ట్యాప్ చేశారన్నారు. 2018లోనే తనను ఓడగొట్టాలని మొదటిసారి ప్రయత్నించారని తెలిపారు.
ఫోన్ ట్యాపింగ్పై ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే తన ఫోన్ ట్యాప్ చేశారన్నారు. 2018లోనే తనను ఓడగొట్టాలని మొదటిసారి ప్రయత్నించారని తెలిపారు. 2021లో హుజూరాబాద్ ఉపఎన్నికల్లో నేను ఎక్కడికి వెళ్తున్నానో, ఎవరితో మాట్లాడుతున్నానో, ఎవరిని కలుస్తున్నానో ట్యాపింగ్ ద్వారా అన్ని తెలుసుకున్నారని ఆరోపించారు .2023లో కూడా అధికారాన్ని దుర్వినియోగం చేసి తనను ఓడగొట్టారన్నారు. దేశద్రోహులు, టెర్రరిస్టులపై నిఘా పెట్టకుండా ప్రతిపక్ష నాయకులపై పెట్టారన్నారు. ధైర్యంగా యుద్ధం చేతకాని వాళ్లే ఇలాంటి వాటికి పాల్పడుతారని ఈటల వ్యాఖ్యానించారు.