News9th Jul 06:01 PMSunil Byrisetty1 min read
మంత్రి నారా లోకేష్ బెంగళూరు పర్యటన సక్సెస్
సత్వా గ్రూపు ప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ చర్చలు జరిపిన కొద్దిగంటల్లోనే ప్రముఖ రియాలిటీ సంస్థ సత్వ గ్రూపు ఎపిలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేసిం
సత్వా గ్రూపు ప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ చర్చలు జరిపిన కొద్దిగంటల్లోనే ప్రముఖ రియాలిటీ సంస్థ సత్వ గ్రూపు ఎపిలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేసింది. సత్వా గ్రూపు ఆధ్వర్యాన విశాఖ నగరంలో 30ఎకరాల విస్తీర్ణంలో సత్వా వాంటేజ్ మిక్స్డ్ డెవలప్ మెంట్ క్యాంపస్ ను రూ.1500 కోట్లతో ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. దీనిద్వారా ప్రత్యక్షంగా 25వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. సత్వా గ్రూపు చేపట్టబోయే వాంటేజ్ ప్రాజెక్టులో గ్లోబల్ స్టాండర్డ్స్ కి అనుగుణంగా గ్రేడ్ – ఎ ఆఫీసులు, ప్రీమియం రెసిడెన్షియల్ యూనిట్లు, స్టార్ట్ అర్బన్ సదుపాయాలు ఏర్పాటు చేస్తారు.