News9th Sep 02:04 PMSunil Byrisetty1 min read
ఎంపీ రామ్మోహన్ నాయుడు కుమారుడికి లోకేష్ ఆశీస్సులు
రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ఢిల్లీలోని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నివాసానికి వెళ్లారు. రామ్మోహన్ నాయుడు, శ్రావ్య దంపతులకు జన్మించిన బాబుకి లోకేష్ ఆశీస్సులు అందజే
రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ఢిల్లీలోని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నివాసానికి వెళ్లారు. రామ్మోహన్ నాయుడు, శ్రావ్య దంపతులకు జన్మించిన బాబుకి లోకేష్ ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా బాబును ఎత్తుకొని ముద్దాడారు. అక్కడే ఉన్న మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తి సతీమణి బండారు మాధవీలతని క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. లోకేష్ రాకపై వారు హర్షం వ్యక్తం చేశారు.