News31st May 05:18 PMSunil Byrisetty1 min read

హైవే పనుల్లో నాణ్యతపై మంత్రి బీసీ ఆగ్రహం

ఉమ్మడి కర్నూలు జిల్లా నందికొట్కూరులో జాతీయ రహదారి 340 C పనులను స్థానిక ఎమ్మెల్యే గిత్త జయసూర్యతో కలిసి రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. జాతీయ రహదారి పనుల

హైవే పనుల్లో నాణ్యతపై మంత్రి బీసీ ఆగ్రహం
ఉమ్మడి కర్నూలు జిల్లా నందికొట్కూరులో జాతీయ రహదారి 340 C పనులను స్థానిక ఎమ్మెల్యే గిత్త జయసూర్యతో కలిసి రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. జాతీయ రహదారి పనుల్లో నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నేషనల్ హవే 340 C కు ఇరువైపులా నాణ్యత, బలం లేని మట్టిని కాంట్రాక్టర్ వాడటంతో.. కోతకు గురైందన్నారు. గతంలో కూడా ఈ కాంట్రాక్టర్ నాణ్యత లేని పనులు చేయడం జరిగిందన్న మంత్రి విజిలెన్స్ ఎంక్వైరీ చేయమని ఆదేశించారు. ఆ విజిలెన్స్ ఎంక్వైరీ రాకపోవడం వెనుక ఎవరున్నారో బయట పెడతామని మంత్రి హెచ్చరించారు. ప్రజాసొమ్మును దుర్వినియోగం చేసి, నాణ్యత లేని రోడ్లును నిర్మించే కాంట్రాక్టర్ల విషయంలో రాజీపడొద్దని ముఖ్యమంత్రే చెప్పారన్నారు.
Andhra Pradesh news
kurnool
Inspection of road works
National Highway 340 C works in Nandikotkur
జాతీయ రహదారి
హైవే పనుల్లో నాణ్యతపై మంత్రి బీసీ ఆగ్రహం
Scroll for the next article