News30th Apr 05:32 PMSunil Byrisetty1 min read
కేంద్రం నిర్ణయం.. జాతీయ భద్రతా సలహా బోర్డు ఏర్పాటు
పహల్గాం ఉగ్ర దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. జాతీయ భద్రతా సలహా బోర్డును ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బోర్డు దేశ భద్రతా వ్యవహారాలపై సలహాలు, స
పహల్గాం ఉగ్ర దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది.
జాతీయ భద్రతా సలహా బోర్డును ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ బోర్డు దేశ భద్రతా వ్యవహారాలపై సలహాలు, సిఫార్సులు అందించే ఉన్నత స్థాయి సంస్థగా పనిచేయనుంది.
ఈ బోర్డుకు మాజీ రా (RAW) చీఫ్ అలోక్ జోషిని ఛైర్మన్గా నియమించారు.
జాతీయ భద్రతా విషయాల్లో అనుభవం ఉన్న అలోక్ జోషి నాయకత్వంలో ఈ బోర్డు దేశ భద్రతా వ్యూహాలను మరింత బలోపేతం చేయనుంది.
ఈ బోర్డులో మొత్తం ఏడుగురు సభ్యులు ఉంటారు, సైన్యం నుంచి రిటైరైన మాజీ వెస్ట్రన్ ఎయిర్ కమాండర్ ఎయిర్ మార్షల్ పీఎం సిన్హా, మాజీ సదరన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఏకే సింగ్, రియర్ అడ్మిరల్ మాంటీ ఖన్నా ఈ బోర్డులో సభ్యులుగా నియమితులయ్యారు.
వీరి అనుభవం, సైనిక వ్యూహాలు పాక్ను ఎదుర్కోవడంలో ఉపయోగపడనున్నాయి.