News12th Dec 04:24 PMSunil Byrisetty1 min read
ఐదేళ్లలో ఇండియాకు 9 లక్షల మంది బైబై
గత ఐదేళ్ల కాలంలో దాదాపు 9 లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ పార్లమెంటుకు తెలియజేసింది. ఈ డేటాను విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ
గత ఐదేళ్ల కాలంలో దాదాపు 9 లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ పార్లమెంటుకు తెలియజేసింది. ఈ డేటాను విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ రాజ్యసభలో లిఖితపూర్వకంగా ఇచ్చారు. భారత పౌరసత్వం విషయంలో పార్లమెంటులో అడిగిన ఒక ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానంలో ఈ డేటాను వెల్లడించారు. భారత పౌరసత్వాన్ని వదులుకునే వ్యక్తుల వార్షిక రికార్డులను ప్రభుత్వం భద్రపరుస్తోందని ఆయన అన్నారు. ఆ రికార్డుల ప్రకారం 2011-19 మధ్య 11,89,194 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. గత 14 సంవత్సరాలలో 20 లక్షలకు పైగా ప్రజలు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. విదేశీ పౌరసత్వాన్ని ఎంచుకునే భారతీయుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోందని విదేశాంగ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.