News5th Jun 11:59 AMSunil Byrisetty1 min read
ఎమ్మెల్యే కోటంరెడ్డి మరో వినూత్న కార్యక్రమం!
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గత నెలలో ఒకే రోజులో 250కిపైగా పనులను ఎమ్మెల్యే కోటంరెడ్డి ప్రారంభించిన విషయం తెలిసి
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గత నెలలో ఒకే రోజులో 250కిపైగా పనులను ఎమ్మెల్యే కోటంరెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమంతో ఆయన సరికొత్త రికార్డును సైతం సృష్టించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సహా పలువురు రాజకీయ ప్రముఖుల ప్రశంసలు పొందారు. తాజాగా ఆయన చంద్రన్న పల్లెపండుగ పేరుతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామాల్లో చేసిన అభివృద్ధిని వివరించేలా కార్యక్రమం ప్రారంభిస్తున్నారు. YCP హయాంలో కుంటుపడ్డ అభివృద్ధిని గాడిలో పెడుతున్నామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి వివరించారు.