International2nd Sep 04:12 PMSunil Byrisetty1 min read

కనీవినీ ఎరుగని విషాదం.. కన్నీట నేపాల్!

నేపాల్ కన్నీరు మున్నీరవుతోంది. ఆకస్మిక వరదలు అతలాకుతలం చేయడంతో వందలాది ప్రాణాలు నీటగలిశాయి. హిమానీ నదం విరిగిపడి విలయతాండవం సృష్టించిన ఈ జల ప్రళయంలో మరణించిన వారి సంఖ్య రోజురోజుకూ

కనీవినీ ఎరుగని విషాదం.. కన్నీట నేపాల్!
నేపాల్ కన్నీరు మున్నీరవుతోంది. ఆకస్మిక వరదలు అతలాకుతలం చేయడంతో వందలాది ప్రాణాలు నీటగలిశాయి. హిమానీ నదం విరిగిపడి విలయతాండవం సృష్టించిన ఈ జల ప్రళయంలో మరణించిన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. బుధవారం నాటికి ఏకంగా 1,127 కు చేరినట్లు నేపాల్ పోలీస్ విభాగం అధికారికంగా ప్రకటించింది. భారీ వరద సంబంధించి వారం రోజులు గడుస్తున్నప్పటికీ ఇంకా వేలాది మంది ఆచూకీ కానరావడం లేదు. దీంతో సహాయక బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ఈ జ‌ల‌విల‌యంలో మ‌ర‌ణించిన వారి మృత‌దేహాల‌కు తాత్కాలిక ఖ‌న‌నం చేస్తున్నారు. గుర్తు తెలియ‌ని పదుల సంఖ్యలో ఒకేచోట మృత‌దేహాల‌ను పాతిపెడుతున్నారు.
International news
Nepal Floods
Nepal Flood Disaster
Nepal Flood Death Toll
Nepal Tragedy
Nepal News
Floods in Nepal
Glacial Lake Outburst
Glacial Flood
Natural Disaster
వరద బాధితులు
సహాయక చర్యలు
గాలింపు చర్యలు
గల్లంతైన వారు
అంతర్జాతీయ వార్తలు
వరద వార్తలు
Scroll for the next article