News26th Aug 11:23 AMSunil Byrisetty1 min read
అలర్ట్.. రేషన్ పంపిణీలో కొత్త మార్పులు
ఏపీలో రేషన్ కు సంబంధించి ఓ అలర్ట్. ఆగస్ట్ 25వ తేదీ నుంచి ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ నెల నుంచి రేషన్ పంపిణీలో కొత్త మార్పులు చోటుచేస
ఏపీలో రేషన్ కు సంబంధించి ఓ అలర్ట్. ఆగస్ట్ 25వ తేదీ నుంచి ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ నెల నుంచి రేషన్ పంపిణీలో కొత్త మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.
స్మార్ట్ రేషన్ కార్డులు, ఈ-పోస్ యంత్రాల సాయంతో సర్వర్ సమస్యలు, వేలిముద్రల ఇబ్బందులకు చెక్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇకపై రేషన్ తీసుకునే సమయంలో వేలిముద్రలు పడకపోయినా లబ్ధిదారులు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ- పోస్ మెషీన్లో ఉన్న కెమెరా సాయంతో ఐరిస్ స్కాన్ చేసి రేషన్ సరుకులు అందిస్తారు.