News30th Aug 04:47 PMSunil Byrisetty1 min read

మార్కాపురం జిల్లా గడ్డపై కొత్త చరిత్ర

మార్కాపురం జిల్లా గడ్డపై కొత్త చరిత్ర ఆవిష్కృతం కాబోతోందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు. నల్లమల కొండలను చీల్చుకుంటూ నల్లమల సాగర్‌లోకి కృష్ణమ్మ జలాలు ప్రవహిస్తాయని పేర్కొన్న

మార్కాపురం జిల్లా గడ్డపై కొత్త చరిత్ర
మార్కాపురం జిల్లా గడ్డపై కొత్త చరిత్ర ఆవిష్కృతం కాబోతోందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు. నల్లమల కొండలను చీల్చుకుంటూ నల్లమల సాగర్‌లోకి కృష్ణమ్మ జలాలు ప్రవహిస్తాయని పేర్కొన్నారు. ఆ ప్రాంత ప్రజల దశాబ్దాల నీటి కష్టాలను సమూలంగా కడిగేస్తాయని పేర్కొన్నారు. కరవుతో అల్లాడుతున్న పశ్చిమ ప్రకాశం ప్రజల కష్టాలు తీర్చాలన్న సంకల్పంతో 1996లో మొదలుపెట్టిన ప్రాజెక్టు మొదటి దశను పూర్తి చేసి రేపు ప్రారంభించే అవకాశం రావడం భావోద్వేగానికి గురిచేస్తోందని పేర్కొన్నారు. మొదటి దశ ద్వారా 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందుతుంది. ఈ మహాయజ్ఞం కోసం తమ భూములను, ఇళ్లను, పుట్టిపెరిగిన ఊళ్లను త్యాగం చేసిన 11 గ్రామాల నిర్వాసితులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని వ్యాఖ్యానించారు. రేపు వెలిగొండ పండుగ దగ్గర కలుద్దాం అంటూ పిలుపునిచ్చారు.
Andhra Pradesh
Markapuram District
Velugonda Project
Velugonda Irrigation Project
Chandrababu Naidu
Nallamala Sagar
Krishna River
Irrigation Projects
Water Projects
సాగునీరు
తాగునీరు
రైతులు
నిర్వాసితులు
ఏపీ ప్రభుత్వం
ఏపీ వార్తలు
Scroll for the next article