News21st Aug 04:22 PMSunil Byrisetty1 min read
జీఓఎం జిల్లాల పర్యటన షెడ్యూల్ ఖరారు
జిల్లాల పునర్విభజన, మార్పు చేర్పులపై 3 బృందాలుగా మంత్రులు పర్యటించనున్నారు. ఈ నెల 29, 30 శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూ.గో.జిల్లాల్లో మంత్రులు అనగాని, బీసీ జనార్థన్ రెడ్డి, అనిత ప
జిల్లాల పునర్విభజన, మార్పు చేర్పులపై 3 బృందాలుగా మంత్రులు పర్యటించనున్నారు. ఈ నెల 29, 30 శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూ.గో.జిల్లాల్లో మంత్రులు అనగాని, బీసీ జనార్థన్ రెడ్డి, అనిత పర్యటన చేయనున్నారు. వచ్చే నెల 2న అల్లూరి జిల్లాలో మంత్రుల బృందం పర్యటించనుంది. అలాగే ఈ నెల 29న ప.గో., కృష్ణా జిల్లాల్లో మంత్రులు నాదెండ్ల, నారాయణ పర్యటన నిర్వహించనున్నారు. ఈ నెల 30న చిత్తూరు, కడప జిల్లాల్లో మంత్రుల పర్యటన ఉండనుంది. ఈ నెల 30న ప్రకాశం, నెల్లూరులో మంత్రులు నిమ్మల, సత్యకుమార్ పర్యటన చేపట్టనున్నారు. వచ్చే నెల 2న గుంటూరు జిల్లాలో మంత్రుల పర్యటన కొనసాగనుంది.