News13th Aug 05:47 PMSunil Byrisetty1 min read
ఒంగోలు–గుంటూరు సెక్షన్లో నూతన రైల్వే లైన్లు
ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలు – గుంటూరు సెక్షన్లో మంజూరైన నిర్మాణంలోని రైల్వే ప్రాజెక్టులు, ఒంగోలు నుంచి పక్క జిల్లాలలో నూతన, అనుసంధాన రైల్వే లైన్లపై ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్
ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలు – గుంటూరు సెక్షన్లో మంజూరైన నిర్మాణంలోని రైల్వే ప్రాజెక్టులు, ఒంగోలు నుంచి పక్క జిల్లాలలో నూతన, అనుసంధాన రైల్వే లైన్లపై ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పార్లమెంటులో ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానమిస్తూ ఒంగోలు – విజయవాడ – గూడూరు అనుసంధానాన్ని పెంచుటకు 287 కి.మీ. 3 వ లైన్ నిర్మించబడుతోందని చెప్పారు. ఒంగోలు – గుంటూరు పట్టణాలు తెనాలి జంక్షన్ తో ఇప్పటికే అనుసంధానించబడిందని తెలిపారు. ఈ సెక్షన్ లో ఒంగోలు – దొనకొండ 87 కి.మీ. నూతన రైల్వే లైన్ నిర్మాణానికి తుది సర్వే మంజూరయినదని వివరించారు. బలార్షా – తెనాలి – ఒంగోలు – గుంటూరు 782 కి. మీ. 4 లైన్ కు ప్రాజెక్ట్ రిపోర్టు తయారు చేయబడిందని, నడికుడి – శ్రీకాళహస్తి 309 కి.మీ. నూతన రైల్వే లైన్ నిర్మాణం మొత్తం ఖర్చు రూ.3,407 కోట్లకు గాను, రూ.2,384 కోట్లు ఖర్చు చేయబడిందని, పిడుగురాళ్ళ – శావల్యాపురం 46 కి. మీ., గుండ్లకమ్మ – కనిగిరి 79 కి.మీ. ప్రాజెక్ట్స్ రిపోర్టులు ప్రారంబించబడ్డాయని తెలిపారు. వివరణాత్మక ప్రాజెక్టు రిపోర్టు తయారయిన తర్వాత, సంబంధిత భాగస్వాములను సంప్రదించి రైల్వే ప్రాజెక్టులు మంజూరు చేస్తామని తెలిపారు.