News29th Jul 05:28 PMSunil Byrisetty1 min read
డెబిట్ కార్డ్ సైజులో స్మార్ట్ రైస్ కార్డులు!
రాష్ట్రంలో కొత్త రైస్ కార్డులు జారీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఏ రాజకీయ పార్టీ నాయకుల ఫొటోస్ లేకుండా కార్డులను డిజైన్ చేశామని తెలిపారు. కొత్త
రాష్ట్రంలో కొత్త రైస్ కార్డులు జారీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఏ రాజకీయ పార్టీ నాయకుల ఫొటోస్ లేకుండా కార్డులను డిజైన్ చేశామని తెలిపారు. కొత్త కార్డులు డెబిట్ కార్డ్ సైజులో ఇవ్వబోతున్నామని చెప్పారు. క్యూ ఆర్ కోడ్ సహాయంతో ఈ కార్డులు ఉంటాయన్నారు. ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డులు ఇస్తున్నామని వెల్లడించారు. కేంద్రం 60 శాతం రైస్ కార్డులకు సహాయం అందిస్తోందని స్పష్టం చేశారు. రైస్ కార్డుల్లో మార్పులు చేర్పులు కోసం 16 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చాయని.. కొత్తగా 9 లక్షల మందికి పైగా కొత్త కార్డులు వచ్చాయన్నారు. ఆగస్ట్ 25 నుంచి 31 వరకు రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుందన్నారు.