News28th Jun 10:55 AMSunil Byrisetty1 min read

NIAకి విజయనగరం ఉగ్ర పేలుళ్ల కుట్ర కేసు

విజయనగరం ఉగ్ర పేలుళ్ల కుట్ర కేసును NIAకి అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. ఈ కేసులో విజయనగరానికి చెందిన సిరాజ్, హైదరాబాద్‌కి చెందిన సమీర్, వరంగల్‌కి చెందిన మొయిద్దీన్‌ను NIA అదుపులోక

NIAకి విజయనగరం ఉగ్ర పేలుళ్ల కుట్ర కేసు
విజయనగరం ఉగ్ర పేలుళ్ల కుట్ర కేసును NIAకి అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. ఈ కేసులో విజయనగరానికి చెందిన సిరాజ్, హైదరాబాద్‌కి చెందిన సమీర్, వరంగల్‌కి చెందిన మొయిద్దీన్‌ను NIA అదుపులోకి తీసుకుని విచారించింది. ఈ నేపథ్యంలో మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు కేసును తమకు అప్పగించేందుకు కేంద్ర హోంశాఖ నుంచి అనుమతి తీసుకుంది.కేసుకు సంబంధించిన వివరాలను NIAకి విజయనగరం టూటౌన్ పోలీసులు అందించనున్నారు. నిందితులపై సెక్షన్ 113, 147,148,149,154ల కింద కేసు నమోదు చేశారు. కాగా నిందితులు సిరాజ్, సమీర్ ప్రస్తుతం విశాఖ సెంట్రల్ జైలులో ఉన్నారు.
Andhra Pradesh news
vizianagaram
NIA
Vizianagaram terror conspiracy case
terror
siraj
sameer
తెలుగు రాష్ట్రాలతో పాటు చెన్నై
ముంబై
ఢిల్లీలో పేలుళ్లకు ప్లాన్
Scroll for the next article