News17th Aug 01:12 PMSunil Byrisetty1 min read

కేరళలో మరో ప్రాణాంతక వ్యాధి.!

కేరళలో మరో ప్రాణాంతక వ్యాధి బయటపడింది. కోజికోడ్ జిల్లాలోని తొమ్మిదేళ్ల బాలికకు అమీబిక్ ఎన్‌కెఫలిటిస్ సోకినట్లు గుర్తించారు. ఈ ఏడాది జిల్లాలో మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయని వైద్యు

కేరళలో మరో ప్రాణాంతక వ్యాధి.!
కేరళలో మరో ప్రాణాంతక వ్యాధి బయటపడింది. కోజికోడ్ జిల్లాలోని తొమ్మిదేళ్ల బాలికకు అమీబిక్ ఎన్‌కెఫలిటిస్ సోకినట్లు గుర్తించారు. ఈ ఏడాది జిల్లాలో మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయని వైద్యులు చెబుతున్నారు. కలుషిత నీటిలో ఉండే అరుదైన "బ్రెయిన్ ఈటింగ్ అమీబా" వల్ల ఈ వ్యాధి వస్తుందని తెలిపారు. మెదడు వాపు వ్యాధికి అమీబిక్ ఎన్‌కెఫలిటిస్ కారణమని రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు ధృవీకరించారు. ఈ వ్యాధి సోకిన తొమ్మిదేళ్ల బాలిక ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మరుసటి రోజు కోజికోడ్ వైద్య కళాశాలలకు తరలించగా, అదే రోజు చికిత్స పొందుతూ మృతి చెందింది. మైక్రోబయాలజీ పరీక్షల్లో అమీబిక్ ఎన్‌కెఫలిటిస్ వ్యాధి కారణంగా బాలిక మరణించిందని వైద్యులు స్పష్టంచేశారు.
India news
Kerala
Deadly Disease
Amebic Encephalitis
Brain-Eating Amoeba
Kozhikode
Child Death
Rare Disease
Contaminated Water
Health Alert
బ్రెయిన్ ఈటింగ్ అమీబా
ప్రాణాంతక వ్యాధి
Scroll for the next article