News4th Oct 03:44 PMSunil Byrisetty1 min read
సోషల్ మీడియాను నియంత్రించే ఉద్దేశం లేదు
సోషల్ మీడియాను నియంత్రించే ఉద్దేశం ఏపీలోని కూటమి ప్రభుత్వానికి లేదని మంత్రి కొలుసు పార్థసారధి స్పష్టం చేశారు. అదే సమయంలో తప్పుడు పోస్టులకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్నారు. భావ
సోషల్ మీడియాను నియంత్రించే ఉద్దేశం ఏపీలోని కూటమి ప్రభుత్వానికి లేదని మంత్రి కొలుసు పార్థసారధి స్పష్టం చేశారు. అదే సమయంలో తప్పుడు పోస్టులకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్నారు. భావప్రకటన స్వేచ్ఛను అడ్డుకోం, కానీ బురదజల్లితే మాత్రం ఊరుకోబోమన్నారు. వ్యక్తిత్వ హననం, మత విద్వేషాలు రెచ్చగొడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. తప్పుడు పోస్టులతో ఏపీ బ్రాండ్ను చెడగొడితే ఊరుకోబోమన్నారు. అన్నీ అధ్యయనం చేశాకే చట్టం తీసుకొస్తామని మంత్రి వెల్లడించారు.