National20th Jul 02:02 PMSunil Byrisetty1 min read
ఆధార్లో మార్పులు.. ఆ వివరాలు తొలగింపు!
ఆధార్లో సరికొత్త మార్పులు చోటుచేసుకున్నాయి. మొబైల్ సిమ్, బ్యాంకు ఖాతా, పాస్పోర్టు, ధ్రువీకరణ పత్రాలు, సంక్షేమ పథకాలకు గుర్తింపుగా తీసుకునే ఆధార్ కార్డులపై ఇక నుంచి తండ్రి/భర్త
ఆధార్లో సరికొత్త మార్పులు చోటుచేసుకున్నాయి. మొబైల్ సిమ్, బ్యాంకు ఖాతా, పాస్పోర్టు, ధ్రువీకరణ పత్రాలు, సంక్షేమ పథకాలకు గుర్తింపుగా తీసుకునే ఆధార్ కార్డులపై ఇక నుంచి తండ్రి/భర్త పేరు ఉండదు. ఆధార్లో పేరు కింద ఉండే ఈ వివరాలను తొలగించారు. ఈ మేరకు తొలగిస్తూ 'భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ)' నిర్ణయం తీసుకుంది. పుట్టినతేదీకి బదులు ఇకనుంచి కేవలం పుట్టిన సంవత్సరాన్నే నమోదు చేస్తారు.
దీనికి సంబంధించి యూఐడీఏఐ డిప్యూటీ డైరెక్టర్ హిమాన్షు ఉత్తర్వులు జారీచేశారు. కొత్త మార్పులను గతంలోనే పేర్కొనగా.. ఈ నెల 18 నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చాయి. 18 ఏళ్లలోపు ఉండే పిల్లల (మైనర్ల) ఆధార్లోనే మాత్రమే కేరాఫ్ స్థానంలో వారి తండ్రి పేరు ఉంటుంది.