Politics25th May 10:08 AMSunil Byrisetty1 min read
త్వరలో మిగతా నామినేటెడ్ పదవుల భర్తీ
గడిచిన ఎన్నికల్లో కూటమి విజయంలో కార్యకర్తల కృషి మరువలేనిదని మంత్రి సవిత కొనియాడారు. కష్టపడిన ప్రతి కార్యకర్తకూ గుర్తింపు ఇస్తామన్నారు. త్వరలోనే నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని, ఇ
గడిచిన ఎన్నికల్లో కూటమి విజయంలో కార్యకర్తల కృషి మరువలేనిదని మంత్రి సవిత కొనియాడారు.
కష్టపడిన ప్రతి కార్యకర్తకూ గుర్తింపు ఇస్తామన్నారు. త్వరలోనే నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని, ఇప్పటికే ఈ దిశగా మంత్రి నారా లోకేశ్ చర్యలు ప్రారంభించారని వెల్లడించారు.
గత ప్రభుత్వంలో టీడీపీ నాయకులపైనా బనాయించిన అక్రమ కేసుల మాఫీపైనా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.
ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడపలో నిర్వహించే మహానాడు విజయవంతానికి కృషి చేయాలన్నారు.
జిల్లా టీడీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలిరావాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు.