News29th Sep 03:25 PMSunil Byrisetty1 min read
5 వేలు కాదు 50 వేల ఆలయాలు కడతాం
రాష్ట్రంలో ఆలయాలు నిర్మిస్తామంటూ సీఎం చంద్రబాబు ప్రకటనపై పీసీసీ అధ్యక్షురాలు షర్మిల చేసిన వ్యాఖ్యలకు బీజేపీ అధికార ప్రతినిధి యామినీశర్మ కౌంటర్ ఇచ్చారు. ప్రజల పన్నులకు, హిందువుల ముడ
రాష్ట్రంలో ఆలయాలు నిర్మిస్తామంటూ సీఎం చంద్రబాబు ప్రకటనపై పీసీసీ అధ్యక్షురాలు షర్మిల చేసిన వ్యాఖ్యలకు బీజేపీ అధికార ప్రతినిధి యామినీశర్మ కౌంటర్ ఇచ్చారు. ప్రజల పన్నులకు, హిందువుల ముడుపులకు తేడా తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు. టీటీడీ దళితవాడల్లో 5 వేల ఆలయాలు కడతామని సీఎం చంద్రబాబు చెప్పగానే షర్మిల మాట్లాడడాన్ని ఆమె ప్రశ్నించారు. 5 వేలు కాదు 50 వేల ఆలయాలు కడతామని కౌంటరిచ్చారు. భక్తుల విరాళాలు ఆలయాల కోసం వెచ్చిస్తే కూడా షర్మిల ప్రశ్నిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.