News5th Jul 12:50 PMSunil Byrisetty1 min read

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవిస్తే బేబీ కిట్లు

ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన వారికి ఎన్టీఆర్‌ బేబీ కిట్లు అందించాలని నిర్ణయించింది. 2016లో అప్పటి టీడీపీ ఈ బేబీ కిట్ల పంపిణీ పధకం అమల్ల

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవిస్తే బేబీ కిట్లు
ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన వారికి ఎన్టీఆర్‌ బేబీ కిట్లు అందించాలని నిర్ణయించింది. 2016లో అప్పటి టీడీపీ ఈ బేబీ కిట్ల పంపిణీ పధకం అమల్లో ఉండేది. తర్వాత నిలిచిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వంలో మొదలు పెట్టేందుకు చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ బేబీ కిట్ల టెండర్ల బాధ్యతను ఏపీఎంఎస్‌ఐడీసీకి అప్పగించనుంది. రూ. 1410 విలువ చేసే ఈ బేబీ కిట్లలో దోమ తెరతో కూడిన పరుపు, దుస్తులు, న్యాప్కిన్స్,సబ్బు, పౌడర్ మొదలగు 11 వస్తువులు ఉంటాయి. వీటిని ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీ చేయించుకున్న గర్భిణులకు అందించనున్నారు.
Andhra Pradesh news
cm chandra babu
NTR baby kits scheme
Government hospitals
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవిస్తే బేబీ కిట్లు
Scroll for the next article