News18th Jan 03:27 PMSunil Byrisetty1 min read
టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ 30వ వర్థంతి
టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ 30వ వర్థంతి కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. ఎన్టీఆర్ మనందరికీ దూరమై 30 ఏళ్లు అవుతున్నా తెలుగు జాతి గుండెల్లో శాశ్వతంగా
టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ 30వ వర్థంతి కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. ఎన్టీఆర్ మనందరికీ దూరమై 30 ఏళ్లు అవుతున్నా తెలుగు జాతి గుండెల్లో శాశ్వతంగా ఉండే ఏకైక నాయకుడని అన్నారు. తెలుగు జాతి ఖ్యాతిని ఎవరెస్ట్ అంత ఎత్తుకు తీసుకెళ్లిన యుగపురుషుడని, పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చి.. ఒక చరిత్ర సృష్టించారని కొనియాడారు. విద్యావంతులను.. మేథావులను.. సమర్థులను ఎన్టీఆర్ రాజకీయాల్లోకి తీసుకొచ్చారన్నారు. పేదల అభ్యున్నతే లక్ష్యంగా పాలన చేపట్టారని పేర్కొన్నారు.