News16th Jun 05:17 PMSunil Byrisetty1 min read
మొరాయించిన ముఖ్యమంత్రి హెలికాప్టర్
విమానం, హెలికాఫ్టర్ ప్రయాణాలంటే దడ పుట్టే పరిస్థితి ఏర్పడుతోంది. ఇటీవల అహ్మదాబాద్ విమాన ప్రమాదంతో అందరూ అలర్టయ్యారు. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలకు వాడే హ
విమానం, హెలికాఫ్టర్ ప్రయాణాలంటే దడ పుట్టే పరిస్థితి ఏర్పడుతోంది. ఇటీవల అహ్మదాబాద్ విమాన ప్రమాదంతో అందరూ అలర్టయ్యారు. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలకు వాడే హెలికాప్టర్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. అదే హెలికాప్టర్ను కేంద్రమంత్రి పియూష్ గోయల్ రాష్ట్ర పర్యటనకు కూడా కేటాయించారు. ఆ హెలికాప్టర్లో ఆయన కృష్ణపట్నం వెళ్లాల్సి ఉండగా.. సమస్యలు బయటపడడంతో పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో హెలికాప్టర్లోని సాంకేతిక సమస్యలపై నివేదిక సమర్పించాలని డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్ను ఆదేశించారు.