Agriculture10th Aug 10:13 AMSunil Byrisetty1 min read
మామిడికి బదులు ఈ పంట మేలు!
చిత్తూరు జిల్లాలో మామిడి పంట ఎక్కువగా సాగు చేస్తారు. మామిడి సాగు పెరగడం, వర్షాలు లేకపోవడం.. తెగుళ్లు రావడంతో ఇటీవల కాలంలో నష్టాలు మొదలయ్యాయి. అయితే, ఆ నష్టాలు పూడవాలంటే ఆయిల్ పామ్
చిత్తూరు జిల్లాలో మామిడి పంట ఎక్కువగా సాగు చేస్తారు. మామిడి సాగు పెరగడం, వర్షాలు లేకపోవడం.. తెగుళ్లు రావడంతో ఇటీవల కాలంలో నష్టాలు మొదలయ్యాయి. అయితే, ఆ నష్టాలు పూడవాలంటే ఆయిల్ పామ్ సాగు చేయాలంటూ అధికారులు చెబుతున్నారు. అయిల్ పామ్ సాగు విస్తరణ పెంచాలని ప్రభుత్వం చూస్తోంది. దానిలో భాగంగానే ఉద్యాన శాఖ అధికారులు ఈ పంటపై ఎక్కువ అవగాహన కూడా కల్పిస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని ఆరు మండలాల్లో ఆయిల్ పామ్ సాగును ఉద్యానశాఖ అధికారులు ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఈ ఆయిల్ పామ్ సాగు పర్యావరణానికి కూడా మేలు చేకూరుస్తుందని అధికారులు అంటున్నారు. ఈ మొక్కను ఒకసారి నాటితే 30 ఏళ్ల వరకూ దిగుబడులు వస్తాయని అంటున్నారు. పెట్టుబడి తక్కువగా ఉంటుందని.. మూడేళ్ల తర్వాత లాభాలు రావడం మొదలవుతుందని చెబుతున్నారు.