Telangana2nd Sep 01:08 PMSunil Byrisetty1 min read
ఆంధ్రా ఎంపీ కొడుకుకో న్యాయం.. బీఆర్ఎస్ కో న్యాయమా?
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జనసేన ఎంపీ కొడుకు అరాచకానికి పాల్పడ్డాడంటూ గుర్తు చేశారు. ఆంధ్రాలోని వేరే పార్టీల ఎంపీల కొడుకులు హైదరాబాద్ నడిబొ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జనసేన ఎంపీ కొడుకు అరాచకానికి పాల్పడ్డాడంటూ గుర్తు చేశారు. ఆంధ్రాలోని వేరే పార్టీల ఎంపీల కొడుకులు హైదరాబాద్ నడిబొడ్డున గుద్ది చంపినా కేసులు ఉండవా అని నిలదీశారు. కానీ తమపై కేసులు పెడుతున్నారంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల జనసేన ఎంపీ కుమారుడు నడిరోడ్డుపై యాక్సిడెంట్ చేయడంతో ఓ ప్రైవేట్ సంస్థ ఉద్యోగిని మరణించింది. ఆ కేసులో ఎంపీ కొడుకును ఇంతవరకు అరెస్ట్ చేయలేదని విమర్శించారు. హైటెక్ సిటీ ప్రాంతంలో పట్టపగలే యాక్సిడెంట్ జరిగినా.. ఇంతవరకు జనసేన ఎంపీ కుమారుడు చేసిన యాక్సిడెంట్కు సంబంధించిన వీడియోలు బయటకు రాకపోవడంపై ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.