National20th Jun 11:00 AMSunil Byrisetty1 min read
ఇరాన్ వార్.. భారత్ ఆపరేషన్ సింధు
ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో భారత్ ఆపరేషన్ సింధు ప్రారంభించింది. యుద్ధంతో అతలాకుతలమైన ఇరాన్ నుంచి 110 మంది భారతీయ విద్యార్థులతో కూడిన ప్రత్యేక విమానం ఢిల్లీకి చేర
ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో భారత్ ఆపరేషన్ సింధు ప్రారంభించింది. యుద్ధంతో అతలాకుతలమైన ఇరాన్ నుంచి 110 మంది భారతీయ విద్యార్థులతో కూడిన ప్రత్యేక విమానం ఢిల్లీకి చేరుకుంది. ఈ విద్యార్థులను మొదట ఇరాన్ నుంచి అర్మేనియాకు తరలించారు. అక్కడి నుంచి వారిని భారత్కు తీసుకువచ్చారు. ఈ విద్యార్థులలో, 90 మంది జమ్మూ, కశ్మీర్కు చెందిన వారు కాగా.. వీరంతా వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. విద్యార్థుల కుటుంబాలు విమానాశ్రయంలో బారులు తీరాయి. రాజస్థాన్కు చెందిన ఓ విద్యార్థి తండ్రి మాట్లాడుతూ.. “నా కొడుకు ఇరాన్లో ఎంబీబీఎస్ చేస్తున్నాడు. అతను ఇప్పుడు భారత ప్రభుత్వం పంపిన ప్రత్యేక విమానంలో తిరిగి వచ్చాడు. నేను భారత రాయబార కార్యాలయానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను” అని అన్నారు.