News16th May 10:52 AMSunil Byrisetty1 min read
విజయవాడలో 5 వేల మందితో భారీ తిరంగా ర్యాలీ
విజయవాడలో 5 వేల మందితో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించనున్నారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన నేపథ్యంలో భారీ తిరంగా ర్యాలీకి సిద్ధమయ్యారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజిసర్కి
విజయవాడలో 5 వేల మందితో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించనున్నారు.
ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన నేపథ్యంలో భారీ తిరంగా ర్యాలీకి సిద్ధమయ్యారు.
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజిసర్కిల్ వరకు ర్యాలీ కొనసాగనుంది.
సాయంత్రం 5 గంటలకు తిరంగా ర్యాలీ ప్రారంభం కానుంది.
తిరంగా ర్యాలీలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ పాల్గొననున్నారు.
అలాగే పలువురు మంత్రులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు పాల్గొంటారు.
జాతీయ సమైక్యత, సమగ్రతను చాటేలా విద్యార్థులు గీతాలాపన చేయనున్నారు