News21st Jul 02:07 PMSunil Byrisetty1 min read
పార్లమెంటులో విపక్షాలకు అవకాశం ఉండాలి
సభలో విపక్షాలకు కూడా మాట్లాడటానికి అవకాశం ఉండాలని కాంగ్రెస్ ఎంపీలు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఆమె మాట్లాడుతూ సభలో రెండు విషయాలు చె
సభలో విపక్షాలకు కూడా మాట్లాడటానికి అవకాశం ఉండాలని కాంగ్రెస్ ఎంపీలు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఆమె మాట్లాడుతూ సభలో రెండు విషయాలు చెప్పాలనుకున్నానని, కానీ రక్షణ మంత్రి, ఇతరులు మాట్లాడతారని కానీ, విపక్ష నేతగా నాకు అవకాశం ఇవ్వలేదని రాహుల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆపరేషన్ సిందూర్పై చర్చకు సిద్ధమా.. చర్చకు సిద్ధంగా ఉంటే మాకెందుకు అవకాశం ఇవ్వలేదని ప్రశ్నించారు. విపక్ష నేతగా రాహుల్ కు అవకాశం ఇచ్చి ఉండాల్సిందని ప్రియాంక అన్నారు. చర్చకు సిద్ధంగా ఉంటే విపక్షాల గొంతు ఎందుకు నొక్కుతున్నారని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు.