Politics8th Mar 10:57 AMSunil Byrisetty1 min read

రెండో విడత P4 సర్వే షురూ.!

పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం అమలు చేయనున్న P4 సర్వే ఈ నెల 8 నుంచి 18 వరకు చేపట్టనున్న సర్వే ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్, ప్రైవేటు, పీపుల్ భాగస్వామ్యం (పీ4)తో ఉగ

రెండో విడత P4 సర్వే షురూ.!
పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం అమలు చేయనున్న P4 సర్వే ఈ నెల 8 నుంచి 18 వరకు చేపట్టనున్న సర్వే ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్, ప్రైవేటు, పీపుల్ భాగస్వామ్యం (పీ4)తో ఉగాది నుంచి ఈ కార్యక్రమం చేపట్టనుంది. కుటుంబ వివరాలు, సామాజిక ఆర్థిక స్థితిగతులకు సంబంధించి మొత్తం 27 ప్రశ్నల ద్వారా సమాచారం సేకరించనున్నారు. సర్వే పూర్తయ్యాక ఈనెల 21వ తేదీన సమాచార జాబితాను గ్రామ సభల్లో ప్రదర్శించనున్నారు. ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామి కవేత్త ఉండాలన్నదే ప్రభుత్వ ఆశయంగా సర్వే కొనసాగుతోంది.
Andhra Pradesh
P4 Survey
TDP
ఆంధ్రప్రదేశ్
పి 4 సర్వే
టి డి పి
Scroll for the next article