Spiritual16th Jan 04:31 PMSunil Byrisetty1 min read
శబరిమలలో పడిపూజ నేడు
శబరిమల మకరవిళక్కు తీర్థయాత్ర కాలంలో నిర్వహించే అత్యంత విశిష్టమైన పడిపూజ నేడు (జనవరి 16) ప్రారంభం కానుంది. కఠినమైన వ్రత నియమాలను పాటిస్తూ , ఇరుముడి ధరించిన భక్తులు పాదాలు మోపే ఆ పవి
శబరిమల మకరవిళక్కు తీర్థయాత్ర కాలంలో నిర్వహించే అత్యంత విశిష్టమైన పడిపూజ నేడు (జనవరి 16) ప్రారంభం కానుంది. కఠినమైన వ్రత నియమాలను పాటిస్తూ , ఇరుముడి ధరించిన భక్తులు పాదాలు మోపే ఆ పవిత్రమైన పద్దెనిమిది మెట్లను (పతినెట్టాంపడి) పూలతోనూ , పట్టు వస్త్రాలతోనూ , దివ్యమైన దీపాలతోనూ అలంకరించి ఈ పూజను నిర్వహిస్తారు. నేటి సాయంత్రం దీపారాధన అనంతరం 6:45 గంటలకు పడిపూజ ప్రారంభమవుతుంది. ప్రధాన తంత్రి కంఠరారు మహేష్ మోహనరు , మేల్శాంతి ఇ.డి. ప్రసాద్ నంబూతిరిల నేతృత్వంలో సుమారు ఒక గంట పాటు ఈ క్రతువు కొనసాగుతుంది. పడిపూజ జరుగుతున్న సమయంలో భక్తులకు మెట్ల ద్వారా ప్రవేశం ఉండదు.