Spiritual30th Aug 02:38 PMSunil Byrisetty1 min read
పైడితల్లి అమ్మవారి ఉత్సవాల సన్నాహక సమావేశం
విజయనగరంలో పైడితల్లి అమ్మవారి ఉత్సవాల సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. మంత్రితో పాటు స్థానిక శాసనసభ్యురాలు అదితి విజయ
విజయనగరంలో పైడితల్లి అమ్మవారి ఉత్సవాల సన్నాహక సమావేశం నిర్వహించారు.
సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. మంత్రితో పాటు స్థానిక శాసనసభ్యురాలు అదితి విజయలక్ష్మి గజపతి రాజు, డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ, జిల్లా కలెక్టర్, ఎస్పీలు పాల్గొన్నారు. ఉత్సవాల నిర్వహణ, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై సమావేశంలో చర్చించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పైడితల్లి అమ్మవారి ఉత్సవాలను విజయవంతం చేయడానికి అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు.