National3rd Dec 12:21 PMSunil Byrisetty1 min read
మరోసారి పాక్ పరువు బజారుకు.. ఈసారి శ్రీలంక
వరదలో అతలాకుతలమైన శ్రీలంకకు అందించిన సాయంలోనూ పాకిస్థాన్ తన నీచబుద్ధిని బయటపెట్టుకుంది. శ్రీలంకలో వరదలు బీభత్సం సృష్టించిన నేపథ్యంలో అక్కడి ప్రజలను ఆదుకునేందుకు ఇప్పటికే భారత ప్రభు
వరదలో అతలాకుతలమైన శ్రీలంకకు అందించిన సాయంలోనూ పాకిస్థాన్ తన నీచబుద్ధిని బయటపెట్టుకుంది. శ్రీలంకలో వరదలు బీభత్సం సృష్టించిన నేపథ్యంలో అక్కడి ప్రజలను ఆదుకునేందుకు ఇప్పటికే భారత ప్రభుత్వం అత్యవసర మానవతా సాయాన్ని అందించింది. అయితే ఇది చూసిన పాకిస్థాన్ ప్రభుత్వం కూడా శ్రీలంకకు ఫుడ్ ప్యాకేజీలను పంపింది. ఈ విషయాన్ని అక్కడి పాక్ హైకమిషనర్ కార్యాలయం ట్వీట్ చేయగా.. ఎక్స్పైరీ ఫుడ్ పంపినట్లు నెటిజన్లు గుర్తించారు. ఇలా పాడైపోయిన వాటిని పంపి డప్పు కొట్టుకోవడం ఎందుకంటూ మండిపడుతున్నారు. దీంతో సాయం చేయకపోయినా ఫర్లేదు కానీ, అవసరంలో ఉన్న వారికి పాడైన ఆహారం ఇవ్వడమేంటని పాక్ పరువు తీస్తున్నారు.