News28th Aug 04:02 PMSunil Byrisetty1 min read
నో మైనింగ్ జోన్గా పంచదార్ల!
పంచదార్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, వైయస్ఆర్సీపీ పోరాటంతో కూటమి ప్రభుత్వం దిగొచ్చినట్లు పేర్కొంది. అనకాపల్లి జిల్లా పంచదార్ల కొండను ప్రభుత్వం నో మైనింగ్ జోన్గా ప్రకటించింది. పం
పంచదార్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, వైయస్ఆర్సీపీ పోరాటంతో కూటమి ప్రభుత్వం దిగొచ్చినట్లు పేర్కొంది. అనకాపల్లి జిల్లా పంచదార్ల కొండను ప్రభుత్వం నో మైనింగ్ జోన్గా ప్రకటించింది. పంచదార్ల కొండను ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ గత కొన్ని రోజులుగా ప్రజలు అలుపెరగని పోరాటం చేశారు. స్థానిక ప్రజలు
భారీగా నిరసనలు తెలపడంతో పాటు కేంద్ర మంత్రులకు వైయస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో 2.153 హెక్టార్ల పరిధిని నో మైనింగ్ జోన్గా ప్రకటిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పంచదార్ల శివాలయం భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.