News4th Sep 04:11 PMSunil Byrisetty1 min read
ఆంధ్రా పేపర్స్ పై పవన్ కల్యాణ్ ఆగ్రహం
ఆంధ్రా పేపర్స్ యాజమాన్యంపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పన్నులు ఎగ్గొడుతూ కాలుష్యానికి కారణమవుతున్నారని మండిపడ్డారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యల
ఆంధ్రా పేపర్స్ యాజమాన్యంపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పన్నులు ఎగ్గొడుతూ కాలుష్యానికి కారణమవుతున్నారని మండిపడ్డారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. 2016 తర్వాత ఒక్క రూపాయి పన్ను చెల్లించలేదని పేర్కొన్నారు. మొత్తం రూ.21.34 కోట్ల పన్ను బకాయిలున్నాయన్నారు. రాజమండ్రి కాలుష్యానికి ఆంధ్ర పేపర్సే కారణమని చెప్పారు. ఆంధ్రా పేపర్స్పై తక్షణం చర్యలు తీసుకోవాలని.. కాలుష్య నియంత్రణ మండలికి పవన్ ఆదేశాలు జారీ చేశారు.