News12th Sep 09:50 AMSunil Byrisetty1 min read

గురువాయూరప్పను సేవలో పవన్ కళ్యాణ్

కేరళం రాష్ట్రం, త్రిస్సూర్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గురువాయూర్ బాలకృష్ణుని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. గురువాయూర్ ఆలయంలో అత్యంత పవిత్ర సేవగా భావించే వేకువజ

గురువాయూరప్పను సేవలో పవన్ కళ్యాణ్
కేరళం రాష్ట్రం, త్రిస్సూర్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గురువాయూర్ బాలకృష్ణుని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. గురువాయూర్ ఆలయంలో అత్యంత పవిత్ర సేవగా భావించే వేకువజాము నిర్మాల్య దర్శనంలో ఆయన పాల్గొన్నారు. ముందురోజు చేసిన అలంకరణతో స్వామిని చేసుకునే తొలి దర్శనాన్ని నిర్మాల్య సేవగా పిలుస్తారు. ఈ సేవ కోసం శనివారం ఉదయం వేకువజామున 3 గంటలకు పవన్ కళ్యాణ్ గురువాయూర్ ఆలయానికి చేరుకున్నారు. దాదాపు 30 నిమిషాలపాటు ఈ విశిష్ట సేవలో పాల్గొని తరించారు. నిర్మాల్య దర్శనానంతరం సంప్రదాయం ప్రకారం నువ్వుల నూనెతో తైలాభిషేకం చేస్తారు. శంభాభిషేకం, వాకచార్థు సేవలు నిర్వహిస్తారు. స్వామి వారికి ముందు రోజు అలంకరించిన గంధాన్ని తొలగించి అభ్యంగన స్నానం చేయించే అద్భుత సేవ గురించి ఆలయ అధికారులు పవన్ కళ్యాణ్ కి వివరించారు. ఈ సందర్భంగా స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
Andhra Pradesh
Pawan Kalyan
Guruvayur Temple
Guruvayurappan
Guruvayur
Kerala
Thrissur
Nirmalya Darshan
Lord Krishna
శ్రీకృష్ణుడు
ఆలయ సేవ
తైలాభిషేకం
శంభాభిషేకం
వాకచార్థు సేవ
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
కేరళ ఆలయాలు
Scroll for the next article