News14th Aug 11:09 AMSunil Byrisetty1 min read
రైలులో ‘పవన్ కళ్యాణ్’ సతీమణి
సాధారణ మహిళగా డిప్యూటీ సీఎం ‘పవన్ కళ్యాణ్’ సతీమణి రైలులో ప్రయాణం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి ‘అన్నా కొణిదెల’ సాధారణ ప్రయాణికులతో కలిసి రైలులో ప్రయాణం చేశారు. ప్రైవేట్
సాధారణ మహిళగా డిప్యూటీ సీఎం ‘పవన్ కళ్యాణ్’ సతీమణి రైలులో ప్రయాణం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి ‘అన్నా కొణిదెల’ సాధారణ ప్రయాణికులతో కలిసి రైలులో ప్రయాణం చేశారు. ప్రైవేట్ జెట్లు, ప్రత్యేక వాహనాలకు భిన్నంగా సామాన్య ప్రయాణికురాలిగా రైలు ప్రయాణం చేయడం వైరల్ అవుతోంది. అన్నా కొణిదెల సింప్లిసిటీపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది. ప్రజలతో మమేకమవుతూ సామాన్య జీవనశైలిని కొనసాగించడం పట్ల నెటిజన్ల ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాప్రతినిధులు, వారి కుటుంబాల నుంచి ఇలాంటి సింప్లిసిటీనే కోరుకుంటున్నామంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.