News30th Sep 10:31 AMSunil Byrisetty1 min read
ఒకవైపు పింఛన్లు.. మరోవైపు నిరసన!
తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్లోని గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు నిరసనలకు దిగారు. అక్టోబర్ 10న 'విజయవాడ మార్చ్' నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే పలువు
తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్లోని గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు నిరసనలకు దిగారు. అక్టోబర్ 10న 'విజయవాడ మార్చ్' నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే పలువురు ఉద్యోగులు ప్రభుత్వ వాట్సాప్ గ్రూపుల నుంచి వైదొలగారు. అయితే, అక్టోబర్ 1న పెన్షన్లు పంపిణీలో పాల్గొననున్నారు. అయితే ఒకవైపు పెన్షన్లు పంపిణీ చేస్తూనే నిరసన తెలియజేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా నల్ల రిబ్బన్లు ధరించి పెన్షన్లు పంచాలని భావిస్తున్నారు.