National20th Sep 01:23 PMSunil Byrisetty1 min read
'ఫుల్ ట్యాంక్' చేయొద్దంటున్న పెట్రోలియం శాఖ
వాహనంలో ఇంధనం 'ఫుల్ ట్యాంక్' కొట్టించకూడదని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ సూచిస్తోంది. భద్రతా చర్యల్లో భాగంగా వాహనంలో పూర్తిగా ఇంధనం నింపకూడదని పెట్రోలియం మంత్రిత్వశాఖ చెబుతోంది.
వాహనంలో ఇంధనం 'ఫుల్ ట్యాంక్' కొట్టించకూడదని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ సూచిస్తోంది. భద్రతా చర్యల్లో భాగంగా వాహనంలో పూర్తిగా ఇంధనం నింపకూడదని పెట్రోలియం మంత్రిత్వశాఖ చెబుతోంది. కార్ల కంపెనీల మాన్యువల్లోని ఇంధన పరిమాణం కంటే ట్యాంకు సామర్థ్యం 20% పెద్దదిగా ఉంటుంది. అంటే కంపెనీ 37లీటర్లు అని మాన్యువల్లో ఇస్తే, 42లీ. పైనే పడుతుంది. ట్యాంకులో ఖాళీ ప్రదేశం లేకుంటే ఇంజిన్ పనితీరు తగ్గుతుంది.
ఇంధన ఉష్ణోగ్రత పెరిగి, ఆవిరి విస్తరించి ప్రమాదాలకు దారితీయొచ్చు. అందుకే ఇంధనం ఫుల్ ట్యాంక్ చేయొద్దని సూచిస్తోంది.