News5th Oct 04:57 PMSunil Byrisetty1 min read

సోమవారం యథాతథంగా పీజీఆర్ఎస్

ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి జి ఆర్ ఎస్) కార్యక్రమాన్ని ఈ నెల ఆరో తేదీ సోమవారం యథావిధిగా నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఓ ప

సోమవారం యథాతథంగా పీజీఆర్ఎస్
ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి జి ఆర్ ఎస్) కార్యక్రమాన్ని ఈ నెల ఆరో తేదీ సోమవారం యథావిధిగా నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఓ ప్రకటనలో తెలియజేశారు. స్థానిక కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజలనుంచి ఫిర్యాదులను స్వీకరిస్తామని తెలిపారు. కలెక్టరేట్, డివిజన్, మునిసిపల్, మండల కేంద్రాల్లో సంబంధిత అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. అదేవిధంగా అర్జీదారులు తమ అర్జీలను Meekosam.ap.gov.in వెబ్సైట్ నందు నమోదు చేసుకోవచ్చని .. నమోదైన అర్జీల స్థితి, సంబంధిత సమాచారం తెలుసుకునేందుకు 1100కి నేరుగా కాల్ చేయవచ్చన్నారు.
Andhra Pradesh
PGRS
Public Grievance Redressal
NTR District Collector
Public Meeting
Meekosam Website
Complaints
Citizen Services
Collectorate
ప్రజా సమస్యల పరిష్కారం
ఎన్టీఆర్ జిల్లా
కలెక్టర్ లక్ష్మీశ
Scroll for the next article