News23rd Aug 11:09 AMSunil Byrisetty1 min read
జట్లు పట్టుకుని.. నర్సింగ్ విద్యార్థుల హల్ చల్!
కాకినాడలో అమ్మాయిలు జుట్లు పట్టుకుని కొట్టేసుకున్నారు. ఆర్కే కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో విద్యార్థినుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఫోన్ పోయిందంటూ మణిపూర్కు చెందిన విద్యార్థిని సర్పవరం
కాకినాడలో అమ్మాయిలు జుట్లు పట్టుకుని కొట్టేసుకున్నారు. ఆర్కే కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో విద్యార్థినుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఫోన్ పోయిందంటూ మణిపూర్కు చెందిన విద్యార్థిని సర్పవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వివాదం ముదరడంతో పరస్పరం కొట్టుకున్న విద్యార్థినులు జట్లు పట్టుకున్నారు. తోపులాటలో పలువురికి గాయాలయ్యాయి.
కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో ఇద్దరు విద్యార్థినులకు చికిత్స చేస్తున్నారు. పోలీసులు వచ్చి నచ్చజెప్పడంతో వివాదం సద్దుమణిగింది. మణిపూర్ విద్యార్థినులను మరో హాస్టల్కు తరలించారు.