Technology8th Aug 04:32 PMSunil Byrisetty1 min read
ఫోన్ పే గుడ్ న్యూస్.. చార్జీలకు నో!
యూపీఐ లావాదేవీలపై ఛార్జీల వసూలు బిల్లుకు ఇటీవల లోక్సభ ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డిజిటల్ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేస్తారని ప్రచారం మొదలైంది. యూపీఐ లావాదేవీలపై సా
యూపీఐ లావాదేవీలపై ఛార్జీల వసూలు బిల్లుకు ఇటీవల లోక్సభ ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డిజిటల్ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేస్తారని ప్రచారం మొదలైంది. యూపీఐ లావాదేవీలపై సాధారణ వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో ఫోన్పే వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ నిగమ్ కీలక ప్రకటన చేశారు. యూపీఐ లావాదేవీలపై భారతీయుల నుంచి ఛార్జీలు వసూలు చేయబోమని స్పష్టం చేశారు. భారతీయ యూజర్లకు యూపీఐ సేవలు ఎప్పటికీ ఉచితంగానే ఉంటాయన్నారు. డిజిటల్ లావాదేవీలపై ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టత ఇచ్చారు.