News28th Jan 05:04 PMSunil Byrisetty1 min read

మోడల్ గా పిఠాపురం రైల్వే స్టేషన్

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం మధ్యాహ్నం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని శ్రీవైష్ణవ్ తో సమావేశం అయ్యారు. పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధి, రోడ్డు ఓవర్

మోడల్ గా పిఠాపురం రైల్వే స్టేషన్
ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం మధ్యాహ్నం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని శ్రీవైష్ణవ్ తో సమావేశం అయ్యారు. పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధి, రోడ్డు ఓవర్ బ్రిడ్జి నిర్మాణంతోపాటు పలు అంశాలపై చర్చించారు. సేతు బంధన్ పథకం కింద మంజూరు చేసిన రోడ్డు ఓవర్ బ్రిడ్జిని పీఎం గతిశక్తి పథకం పరిధిలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఇది 2030 జాతీయ రైల్ ప్రణాళికకు అనుగుణంగా లెవల్ క్రాసింగులు తొలగించేందుకు, ట్రాఫిక్ నియంత్రణకు సహకరిస్తుందని తెలిపారు. పిఠాపురం ఆధ్యాత్మికంగా ముఖ్య పట్టణం అయినందున రైల్వే స్టేషన్ ను అమృత్ స్కీం కింద మోడల్ రైల్వే స్టేషన్ గా అభివృద్ధి చేయాలని కోరారు. అష్టాదశ శక్తిపీఠం, శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి కొలువైన క్షేత్రం పిఠాపురంలో ఉన్నందున దర్శనం నిమిత్తం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం మౌలిక వసతులు కల్పించాలని విన్నవించారు. వీటితోపాటు రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న పలు రైల్వే ప్రాజెక్టుల గురించి పవన్ కళ్యాణ్ చర్చించారు. అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించినందుకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.
Andhra Pradesh
Deputy CM Pawan Kalyan
Pithapuram Railway Station
Ashwini Vaishnaw
Indian Railways
Amrit Bharat Scheme
రోడ్డు ఓవర్ బ్రిడ్జి
రైల్వే ప్రాజెక్టులు
ఏపీ మౌలిక సదుపాయాలు
ఆధ్యాత్మిక పర్యటన
Scroll for the next article