News2nd May 11:48 AMSunil Byrisetty1 min read
ప్రధాని మోదీ అమరావతి పర్యటన ఇలా..
ప్రధాని నరేంద్ర మోదీ అమరావతిలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతోపాటు పలు పరిశ్రమలను వర్చువల్గా ప్రారంభించనున్నారు. మ.2:55 గంటలకు గన్నవరం చేరుకోనున్న మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ అమరావతిలో పర్యటించనున్నారు.
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతోపాటు పలు పరిశ్రమలను వర్చువల్గా ప్రారంభించనున్నారు.
మ.2:55 గంటలకు గన్నవరం చేరుకోనున్న మోదీకి మంత్రులు, కూటమి నేతలు స్వాగతం పలకనున్నారు.
మధ్యాహ్నం 3:15కి సచివాలయం దగ్గరికి ప్రధాని మోదీ చేరుకోనున్నారు.
హెలిప్యాడ్ దగ్గర చంద్రబాబు, పవన్ స్వాగతం పలకనున్నారు.
మధ్యాహ్నం 3:30 గంటలకు సభాస్థలికి ప్రధాని మోదీ చేరుకుని పలు ప్రాజెక్ట్లకు శంకుస్థాపనలు చేస్తారు.
సాయంత్రం 4:55కి గన్నవరం వెళ్లనున్న ప్రధాని మోదీ.. గన్నవరం ఎయిర్పోర్టు నుంచి ఢిల్లీకి తిరుగుపయనమవుతారు.